Don't Miss!
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అసలు ఆ యంగ్ హీరో ఉన్నాడా? ఈ మధ్య అస్సలు కనిపించడంలేదు: కత్తి మహేశ్ సెటైర్
కత్తి మహేశ్.. తెలుగు సినీ విమర్శకుడిగా టాలీవుడ్కు పరిచయమైన వ్యక్తి. సినిమాలు విడుదలైన రోజు ఓ న్యూస్ చానెల్లో రివ్యూలు చెప్పేవారు. ఆ తర్వాత తెలుగు రియాలిటీ షో.. 'బిగ్ బాస్' సీజన్ - 1లో అవకాశం రావడంతో, ఆయన వ్యవహారమే మారిపోయింది.
అప్పటి వరకు కొంత మందికే తెలిసిన కత్తి మహేశ్.. హౌస్లోకి ఎంటరైన తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయారు. ఇక, అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు తదితర కారణాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు.
కత్తి మహేశ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, సమాజంలో జరుగుతున్న ప్రతి విషయంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మందికి ఆయన శత్రువుగా మారిపోయారు. మరికొందరు మాత్రం కత్తికి సపోర్టుగా నిలుస్తున్నారు. దీంతో ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఎంతో మందిపై పోస్టులు పెడుతున్నారు.
తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఓ యంగ్ హీరోపై సెటైర్ వేశాడు కత్తి మహేశ్. ఆ హీరో ఎవరో కాదు.. రాజ్ తరుణ్. ఈ విషయంపై కత్తి మహేశ్ తన ఫేస్బుక్ ఖాతాలో 'రాజ్ తరుణ్ అని ఒక హీరో ఉండాలి తెలుగు సినిమా పరిశ్రమలో. ఇంకా నటిస్తున్నాడా!?! ఈ మధ్య అస్సలు కనిపించలేదూ!' అని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
అన్నట్లు రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'గుండె జారి గల్లంతయ్యిందే' ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.