Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
ప్రభంజనం సృష్టస్తున్న మహేష్ ఖలేజా ఆడియో సాంగ్స్..!
ప్రస్తుతం మార్కట్లో ఎక్కడ చూసిన రోబో మరియు బృందావనం ఆడియో గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఈ రెండు సినిమా పాటలు మార్కట్లో బాగా హిట్ అవ్వడమే. వీటి తర్వాత మరో భారీ ప్రాజెక్టు అయినటువంటి ఖలేజా పాటల కూడా ఈ సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి నిర్మాత శింగనయల రమేష్ అంగరంగ వైభవంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సారి ఈ రెండు సినిమాలను మించి ఖలేజా పాటలు ఉంటాయని మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్నారు. దానికి కారణం మహేష్ బాబుకి మణిశర్మ ఇచ్చినటువంటి సినిమాలు అలా ఉన్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులను సోని మ్యూజిక్ వారు సోంతం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. సోని మ్యూజిక్ వారు మాట్లాడుతూ ఖలేజా సినిమాకి మార్కెట్ లో చాలా ఎక్కువ డిమాండ్ ఏర్పడందిని, ఫస్ట్ బంచ్ లోనే ఖలేజా సినిమా క్యాసెట్స్ గాని సిడిలు గాని ఎక్కువగా అమ్ముడై తమకు మంచి లాభాలను తెచ్చి పెడతాయని వారు అంటున్నారు. గతంలో పులి పాటలు ఆడియో రిలీజ్ కు నెట్ లో వచ్చినటువంటి స్పందన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ సారి ఖలేజా సినిమాకి చాలా జాగ్రత్త వ్యవహారించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక పాటల విషయానికి వస్తే ఖలేజా సినిమా పాటలు చాలా బాగున్నాయని అన్నారు. సెప్టెంబర్ 27 ఉదయం ఖలేజా ప్రభంజనాన్ని మీరు మార్కెట్ లో చూడవచ్చని వారు అన్నారు. ఈ సినిమా ప్రిన్స్ మహేష్ బాబు జీవితంలో ఒక గోప్పచిత్రంగా నిలుస్తుందని వారు తెలిపారు.