Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'మహేష్ ఖలేజా' కోసం నిరాహార దీక్షకైనా...
"మా నిత్యశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై గతేడాది అక్టోబరు 20న 'ఖలేజా' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాం. కొత్తదర్శకుడు సుబ్బారెడ్డి చెప్పిన కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్టు పనులను పూర్తి చేయించాం. టైటిల్ ను కూడా అతనే సూచించడంతో వెంటనే రిజిస్టర్ చేయించాం. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నామని కూడా ప్రకటించాం. కాగా...కొన్ని రోజుల క్రితం 'ఖలేజా' అనే టైటిల్ ను మేం మహేష్, త్రివిక్రమ్ లకు ఇచ్చేశామని వార్తలు వచ్చాయి. చూసి షాక్ అవ్వడం మా వంతైంది...మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు నిర్మాత ఎస్.విజయభాస్కర రెడ్డి ఆరోపించారు.
గురువారం ఎస్ విజయభాస్కర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ "పేరు విషయంపై వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశాం. దీంతో వారు 'మహేష్ ఖలేజా'గా మార్చి పోస్టర్లు విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఇది కూడా తప్పు. సినిమా పేరుకు ముందు హీరో పేరును చేర్చి వాడుకొనే నిబంధన ఇప్పటిదాకా రాలేదు. వాణిజ్య మండలి ఈ విషయంపై జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాల"ని కోరారు. అలాగే...ఎంతో కష్టపడి ఈ కథను సిద్ధం చేసుకున్నానని, ఈ విషయంతో తనకు అన్యాయం జరిగితే...ఫిలిం ఛాంబర్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చే స్తానని దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి చెప్పారు.