Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భరత్ అనే నేను రిలీజ్ డేట్ ఫిక్స్?: వేసవి సెలవులమీదే మహేష్ దృష్టి
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది.
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా యూనిట్. ఇందులో మహేష్ బాబు సీఎం గా కనిపించబోతున్నాడన్న విషయమే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెరిగాయి.
షూటింగ్ ఆలస్యం కావడంతో
వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పెద్ద సినిమాల దృష్టి వేసవి మీద పడింది. నెక్స్ట్ సమ్మర్లో నాలుగైదు భారీ సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. అందులో ముందుగా ‘భరత్ అను నేను'కు ముహూర్తం కుదిరిందట. షూటింగ్ ఆలస్యం కావడంతో సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది.. తాజాగా వేసవి సెలవుల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు..
ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. తాజాగా ‘భరత్ అను నేను'కు సంబంధించి ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్ కు సంబంధించిన నంబర్లు వెలుగు చూశాయి. ఏకంగా 18.18 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేటరికల్ రైట్స్ అమ్ముడు బోయాయని సమాచారం. కేవలం ఒక్క తెలుగు వెర్షన్లోనే థియేటరికల్ రైట్సే భారీగా అమ్ముడయినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ 20న రిలీజ్
మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు' తర్వాత వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అధికారిక ప్రకటన చేయకున్నా.. ఈ మేరకు మిగతా నిర్మాతలకు హింట్స్ ఇచ్చేశారు. వచ్చే వేసవికి అల్లు అర్జున్-వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.. రామ్ చరణ్-సుకుమార్ల ‘రంగస్థలం'తో పాటు మరికొన్ని భారీ సినిమాలు రావాల్సి ఉంది.
సంక్రాంతికే అనుకున్నప్పటికీ
"భరత్ అను నేను" సినిమాను ముందు సంక్రాంతికే అనుకున్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం లేటవుతుండటంతో హడావుడి ఎందుకని వేసవిపై దృష్టిపెట్టారు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్', అంతకుముందు చేసిన ‘బ్రహ్మోత్సవం' డిజాస్టర్గా తేలిన నేపథ్యంలో ‘భరత్ అను నేను' అతడి కెరీర్కు చాలా కీలకం. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు.