Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు-కొరటాల శివ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లోనే ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్యాంకాక్లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఈ చిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా కొరటాల శివ ఈచిత్రాన్ని తెరకెక్కించనుండటంతో ఈ టైటిల్ పరిశీలిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మాతలు. మహేష్ బాబు సరసన శృతిహాసన్ కథానాయికగా నటించనుంది. ఆగడు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు ఇటీవల జరిగిన మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాలేక పోయారు. అయితే ఆయన లేని లోటేను భర్తీ చేసేందుకు మహేష్ భర్య నమ్రత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆమెతో పాటు మహేష్ బాబు బావ స్వరూప్ కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'ఆగడు' చిత్రం చివరి దశకు చేరుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.