త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించనున్న కొత్త సినిమా "వరుడు" జూన్లో సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎటువంటి హంగామా లేకుండా నిర్మాణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. బుధవారం (ఏప్రిల్ 30) చాలా మంచి రోజనే వుద్దేశంతో బౌండ్ స్క్రిప్టును పూజలో వుంచినట్లు తెలిసింది. ఈ సంగతి బహిర్గతం చేయకుండా గోప్యంగా వుంచారు. శింగనమల రమేష్, మంజుల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా దీపికా పడుకోనే లేదా ఇలియానా నటించే అవకాశాలున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.