Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మహేష్తో మరోసారి అశ్వనీదత్ చిత్రం(అఫీషియల్)
హైదరాబాద్ : వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన 'రాజకుమారుడు' చిత్రం ద్వారానే మహేష్ హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'సైనికుడు' లాంటి భారీ చిత్రాన్ని కూడా మహేష్ తో నిర్మించారు అశ్వనీదత్. ప్రస్తుతం ప్లాప్ లతో చతికిల పడ్డ వైజయంతీ మూవీస్ బేనర్లో మహేష్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ ఈ బ్యానర్ లో నటించనున్న మూడో సినిమా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుందని సమాచారం. కృష్ణ నిడిమోరు, రాజ్ డి.కె. దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్ నిర్మాత.
అశ్వనీదత్ మాట్లాడుతూ.... ''మహేష్తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్బాబు శైలి, ఇమేజ్కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతాము''అన్నారు. వైజయంతి మూవీస్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం '1' (నేనొక్కడినే) షూటింగ్ లో బిజీగా ఉన్నారు మహేష్. ఇటీవలే 'ఆగడు' కూడా మొదలైంది. డిసెంబరులో '1' చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత వైజయంతి మూవీస్ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్శక ద్వయం మహేష్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ని తయారు చేసే పనిలో ఉన్నారు.
ఇక మహేష్బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం '1' నేనొక్కడినే విషయానికి వస్తే... కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. 14రీల్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. హైదరాబాద్లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది.
నిర్మాత మాట్లాడుతూ...''యాక్షన్ తరహాలోసాగే వైవిధ్యమైన కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నారు'' అని అన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. గౌతమ్ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది.
మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాజి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.