Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గెస్ట్ లుగా ప్రభాస్, మహేష్ ఖరారు
తెలుగు స్టార్ హీరోలు ప్రభాస్,మహేష్ ఇద్దరూ గెస్ట్ లుగా ఓ పంక్షన్ లో కనిపించనున్నారు. ఆ పంక్షన్ మరేదో కాదు ... 'తూనీగ... తూనీగ' ఆడియో పంక్షన్. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'తూనీగ... తూనీగ'. ఎమ్మెస్రాజు ఈ చిత్రానికి దర్శకుడు. మాగంటి రామ్చంద్రన్(రామ్జీ) నిర్మాత. దిల్ రాజు సమర్పకుడు. రియా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రం ఆడియో జూన్ 10న జరగనుంది. కార్తీక్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎమ్.ఎస్ రాజు బ్యానర్ ద్వారా వచ్చిన ఒక్కడు చిత్రంతో మహేష్ కు సూపర్ హిట్ లభించింది. అలాగే వర్షం చిత్రంతో వరస ఫెయిల్యూర్ లలో ఉన్న ప్రభాస్ కెరీర్ లో కదలిక వచ్చింది. దాంతో ఈ ఇద్దరూ తమకు ఓ రకంగా కెరీర్ ఇచ్చిన ఎమ్.ఎస్ రాజు పంక్షన్ కి హాజరవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మ్.ఎస్ రాజు గతంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'మనసంతా నువ్వే'లోని 'తూనీగ... తూనీగ, ఎందాక పరిగెడతావె' పాటలోని పదాలుతో ఈ టైటిల్ ని సెంటిమెంట్ గా పెట్టారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఫెరఫెక్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్ ఎస్ రాజు తన కుమారుడు చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారని వినికిడి. అలాగే తమ బ్యానర్ లో వర్షం,మనసంతా నువ్వే,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంచనాలు ఉన్నారు. ఇక ఎమ్ ఎస్ రాజు వాన చిత్రంతో డైరక్టర్ గా మారారు. ఆయన రెండో చిత్రం ఇది.
నిర్మాత మాగంటి రామ్చంద్రన్ మాట్లాడుతూ.. 'ఇటీవల వారం రోజుల పాటు సంఘీ టెంపుల్లో చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలతో షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల్లోనే ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం' అన్నారు. అలాగే తాతగారైన మాగంటి రవీంద్రనాథ్చౌదరి, ఈవీవీ సత్యనారాయణ ఆశీస్సులతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టానని, సుమంత్ సింగిల్టేక్ ఆర్టిస్ట్ అని నిర్మాత ప్రశంసించారు.