Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేపటి నుంచి మహేష్ బాబు కంటిన్యూగా...
హైదరాబాద్ : తన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ప్రమోషన్ లో గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్న మహేష్ తిరిగి షూటింగ్ బిజీలో పడనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం తదుపరి షెడ్యూల్ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ ధర్డ్ షెడ్యూల్ కంటిన్యూగా జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించి గోవా,హైదరాబాద్ లలో షూటింగ్ పూర్తైంది.
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు.
చిత్రంలో మహేష్ లెక్చరర్ గా కనిపిస్తున్నాడని, టైటిల్ 'ఆచార్య' అని మీడియాలో వినిపించాయి. ఈ నేపధ్యంలో ఆ రూమర్స్ ని ఖండిస్తూ...దర్శకుడు సుకుమార్ క్లారిఫై చేసారు. సుకుమార్ మాట్లాడుతూ... ఈ సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇంకా చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే అవేవీ కావు. అసలింతవరకూ మేం టైటిల్ గురించే ఆలోచించలేదు. ఈ సినిమాకు టైటిల్ ఎంపిక చేయడం కొంచెం కష్టమే అని అన్నారు.
అలాగే ...ఇందులో మహేశ్ లెక్చరర్గా నటిస్తున్నారనేది కూడా అవాస్తవమే. ఈ చిత్రంలో ఆయన పాత్ర సమ్థింగ్ డిఫరెంట్గా ఉంటుంది. మహేశ్ని ఏ విధంగా చూపించబోతున్నాను అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. తనదైన శైలిలో ఉంటూనే కొంచెం నా బాణీ కనిపిస్తుంది.కొంచెం టిపికల్గా అనిపిస్తూ, పూర్తి స్థాయి కమర్షియల్ విలువలతోనే సినిమా ఉంటుంది. అసలు ఈ సినిమా వేరే స్థాయిలో ఉంటుంది. అతిశయోక్తిగా అనిపించినా కూడా ఇంతవరకూ తెలుగులో ఈ తరహాలో సినిమా రాలేదు అని చెప్పారు.
ఢిల్లీకి చెందిన కృతి శానన్ని హీరోయిన్ గా తీసుకున్నాం. ఈ కథకు కొత్తమ్మాయి అయితేనే కరెక్ట్ అని అన్నారు. ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక హడావిడిలో ఉన్న సుకుమార్ తన చిత్రం గురించి ఇలా పలు ఆసక్తికరమైన విషయాలు మీడియాకు తెలియచేసారు. చిత్రం పోగ్రెస్ తెలుపుతూ...ఇప్పటికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యింది. జనవరి 16 నుంచి మూడో షెడ్యూలు మొదలవుతుంది. మే నెలకు మొత్తం వర్క్ పూర్తవుతుంది. సమ్మర్ తర్వాతే రిలీజ్ ఉంటుంది అన్నారు.