Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేశ్ పుట్టినరోజున ఇంకో ‘బిజినెస్మేన్’
హైదరాబాద్ : మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చి హిట్టైన చిత్రం 'బిజినెస్మేన్'. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వెండితెరను పలకరించనుంది. అయితే ఈ సారి బెంగాళి ప్రేక్షకులను అలరించనుంది. 2012 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం బెంగాలీలో పునర్నిర్మాణమైంది. 'బాస్' పేరుతో తయారైన ఈ చిత్రం ఈ నెల 9న బెంగాల్లో విడుదల కానుంది. 9 వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు కావటం విశేషం.
ఇక బెంగాలి 'బిజినెస్మేన్'లో జీత్, శుభశ్రీ గంగూలీ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు బాబా యాదవ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ జీత్ ఇంతకుముందు తెలుగులో వీరు.కె తీసిన 'చందు' సినిమాలో హీరోగా చేశాడు. రిలయన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవలి కాలంలో రెడి, దూకుడు,కృష్ణ ఇలా చాలా తెలుగు సినిమాలు బెంగాలీలో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఇలా వరసగా రీమేక్ లు అవుతూండటంతో ... మనకు కొత్త మార్కెట్ తయారవుతుందని టాలీవుడ్ ప్రముఖులు ఆనందపడుతున్నారు.
ఇక మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) చిత్రం బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ 20 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.