Don't Miss!
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2011 సంక్రాతికి మహేష్ బాబు సినిమా రిలీజ్
మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని 2011సంక్రాతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం మే నెల రెండవ వారంలో మూహూర్తం జరగనుంది. అలాగే రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమై రెండు షెడ్యూలలో పూర్తి అవుతుంది. ఏమి మాయ చేసావే ఫేమ్ సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని 2011 సంక్రాంతికి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించనున్నారు. ఇదే బ్యానర్ లో ప్రస్తుతం శ్రీను వైట్ల, వెంకటేష్ కాంబినేషన్లో నమో వెంకటేశ చిత్రాన్ని తీసి ఈ సంక్రాంతికి రిలీజ్ చేసారు. ఈ చిత్రం గురించి శ్రీనువైట్ల...మహేష్ తో ఇది నా మొదటి సినిమా. నా పొటిన్షియల్ మొత్తం వినియోగించి మంచి చిత్రాన్ని రూపొందిస్తాను. అలాగే ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ జెనర్ లో తీస్తాను. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. నా కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తాను. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందిస్తాను అన్నారు. ప్రస్తుతం మహేష్ ..త్రివిక్రమ్ కాంబినేషన్ లో కలేజా చిత్రం రెడీ అవుతోంది.