Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
‘ సీతమ్మవాకిట్లో...’మనోభావాలను దెబ్బతీసిదంటూ..
హైదరాబాద్ : మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలై చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో ప్రదర్శించిన కొన్ని సన్నివేశాలు హైదవుల, శ్రీరామ భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లి ఖార్జున స్వామి వారి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు ఆరోపించారు. శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో అగ్ని ప్రమాదం సంభవించే సన్నివేశంలో కేవలం హీరోలు తమ హీరోయిజాన్ని ప్రదర్శించటానికి పెట్టారని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు.
శ్రీరామనవమి రోజున పంచభూతాలు సహకరిస్తాయనీ ఆ రోజు ప్రతి గ్రామంలోనూ వరుణదేవుడు వర్షించి చల్లని వాతావరణాన్ని ప్రసాదిస్తారని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎటువంటి ఆటంకాలకు, ప్రకృతి వైపరీత్యాలకు గురైన దాఖలాలు నేటివరకు లేవన్నారు. చిత్రంలో ప్రదర్శించిన నన్నివేశాలు యావత్తు హైందవులను, శ్రీరామ భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రం నుండి అభ్యంతరకరమైన నన్నివేశాలను తొలగించని పక్షంలో కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల చిత్రీకరణ హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని, ఆ సన్నివేశాలను వెంటనే తొలగించి స్వామివారి ప్రాభవాన్ని కాపాడాలని ఖమ్మం శ్రీభ్రమరాంభ సమేత మల్లిఖార్జున దేవస్థానం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మరెగాని శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారికి విజ్ఞప్తి చేశారు.
శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవంలో విద్యుత్షాక్తో అగ్ని ప్రమాదాలు సంభవించినట్లుగా శ్రీరామ భక్తులు మృత్యు భయంతో విలవిలలాడినట్లుగా, కళ్యాణ వేదిక అగ్ని ప్రమాదానికి గురైనట్లుగా అభ్యంతరకరంగా చిత్రీకరించారని సెన్సార్ బోర్డుకు ఇచ్చిన విజ్ఞాపనలో పేర్కొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను ముక్కోటి దేవతలు దర్శిస్తారని భక్తులు విశ్వాసమని, వారి భావాలను దెబ్బతినేలా సినిమా తీయడం భావ్యం కాదని పేర్కొన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.