Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరీ, మహేష్ బాబు కాంబినేషన్ చిత్రం ప్రారంభం ఎప్పుడంటే...
పూరి జగన్నాధ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ది బిజెనెస్ మ్యాన్ అనే చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 20 వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది. పోకిరి తర్వాత మహేష్, పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో మహేష్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని సమాచారం. గ్యాగస్టర్ గా పనిచేయటం కూడా ఓ బిజెనెస్ గా భావించి చేసే ఓ వ్యక్తి కథను ఈ చిత్రం చూపుతుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ట్యాగ్ లైన్ ..గన్స్ డోన్ట్ నీడ్ ఎగ్రిమెంట్స్. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత వెంకట్ తెలియజేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ముందు పోషించనటువంటి పవర్ పుల్ పాత్రను ఈ చిత్రంలో చేస్తారు. పూరి చెప్పిన లైన్ కు మహేష్ బాగా ఇంప్రెస్ అయ్యారు. 'గన్స్ డోన్ట్ నీడ్ అగ్రిమెంట్స్" అనేది ఈ చిత్రం ఉపశీర్షికతో దీనిని బట్టి ఇది ఎంతటి సంచలనాత్మకంగా వుంటుందో ఊహించుకోవచ్చు. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన పోకిరిని మించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. సెన్సేషన్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా తెలుగు సృష్టిస్తుందనే నమ్మకం వుంది" అని తెలిపారు.