twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ అభిమానులకు హ్యాపీ న్యూస్

    By Staff
    |

    Mahesh Babu
    గతంలో మహేష్ బాబుతో 'అతిధి' సినిమాని నిర్మించిన యు.టివి వారు తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా యు.టివీ ప్రతినిధి Ram Mirchandani కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథ ఇప్పటికే మహేష్ కి వినిపించటం ఓకె చేయటం జరిగింది. 'ఘర్షణ' వంటి అడ్వాన్సెడ్ యాక్షన్ ఫిల్మ్ తీయటంలో ఆయనకు ఆయనే సాటి అని పేరు సంపాదించిన గౌతమ్ దర్శకత్వంలో చేయటం మహేష్ అభిమానులను ఆనంద పరిచే విషయం. అలాగే ఈ సినిమా గౌతమ్ కీ మైలేజి ఇచ్చే అవకాశం ఉంది.

    హాలీవుడ్ స్ధాయి హావభావాలు ఇవ్వగల మహేష్ వంటి స్టార్ తో సినిమా చేయటంతో ట్రేడ్ లో మంచి మార్కెట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే యు.టివీ బడ్జెట్ కి వెనకాడే సంస్ధ కాకపోవటం,గౌతమ్ ప్రతిభ...కలసి సాంకేతికంగా తెలుగుకి ఉన్నత స్ధాయి చిత్రం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో గౌతమ్ ...పవన్ తో సినిమా చెయ్యాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం ఆయన గజనీ ఫేమ్ సూర్యా తో Vaaranam Aayiram సినిమా చేస్తున్నారు.

    అది పూర్తవగానే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్క్రిప్టు తమిళ రచయితలు వెర్షన్స్ పూర్తి చేసారని,దాన్ని తెలుగు వెర్షన్ కోసం పరుచూరి వారికి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక మహేష్ ..త్రివిక్రమ్ కాంబినేషన్ షూటింగ్ ఈ చిత్ర షూటింగ్ ఒకే సారి సిమిలర్ గా జరిగే అవకాశం ఉంది. జనవరిలో పూజ జరిపి సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X