twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్-వెంకటేష్ ల మల్టీస్టార్ మూవీ తొలి షెడ్యూల్ వివరాలు...!?

    By Sindhu
    |

    వెంకటేష్, మహేష్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ డిసెంబర్ 5నుంచి ప్రారంభం కాబోతుంది. 30 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ పాల్గొనడు. కానీ వెంకటేష్ పై ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీపార్ట్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

    బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ అది కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా సమంతని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ సరసన మహేష్ కు వదిన పాత్రలో అనుష్క దాదాపుగా ఖరారైపోయింది. జనవరి నుంచి జరిగే షెడ్యూల్ లో మహేష్ పాల్గొంటాడని తెలుస్తోంది. అత్యంత క్రేజీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని సమ్మర్ రాజుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

    ఈ మద్య కాలంలో, చిన్నా చితకా హీరోలతో వచ్చిన సినిమాలకి మల్టీస్టారర్ మూవీస్ అని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు పేర్లు పెట్టుకున్నప్పటికీ వెంకటేష్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాత్రం నిజంగానే మల్టీస్టారర్ మూవీగా వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ కి కొదవలేదు. చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అవుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే...

    English summary
    Venkatesh and Mahesh Babu’s multi-starrer Seethamma Vakitlo Sirimalle Chettu regular shooting will commence from December 5th in in Pollachi. The first schedule will last for 30 days where the director will can crucial scenes on Venkatesh and other star cast of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X