Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్-వెంకటేష్ ల మల్టీస్టార్ మూవీ తొలి షెడ్యూల్ వివరాలు...!?
వెంకటేష్, మహేష్ ల కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ డిసెంబర్ 5నుంచి ప్రారంభం కాబోతుంది. 30 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ పాల్గొనడు. కానీ వెంకటేష్ పై ఈ షెడ్యూల్ లో కీలకమైన టాకీపార్ట్ ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
బిజినెస్ మ్యాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ అది కంప్లీట్ అయ్యాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా సమంతని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ సరసన మహేష్ కు వదిన పాత్రలో అనుష్క దాదాపుగా ఖరారైపోయింది. జనవరి నుంచి జరిగే షెడ్యూల్ లో మహేష్ పాల్గొంటాడని తెలుస్తోంది. అత్యంత క్రేజీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయాలని సమ్మర్ రాజుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
ఈ మద్య కాలంలో, చిన్నా చితకా హీరోలతో వచ్చిన సినిమాలకి మల్టీస్టారర్ మూవీస్ అని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు పేర్లు పెట్టుకున్నప్పటికీ వెంకటేష్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాత్రం నిజంగానే మల్టీస్టారర్ మూవీగా వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ కి కొదవలేదు. చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ అవుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే...