Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిర్మాతగా కొత్త రోల్ లో మహేష్ బాబు
వరస విజయాలతో సూపర్ స్టార్ ఇమేజ్ ని చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ వస్తున్న మహేష్ త్వరలో నిర్మాతగా మారుతున్నారని సమాచారం. ఈ మేరకు ఆయన తన శ్రేయాభిలాషులతో చర్చిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అప్పట్లో మహేష్ తండ్రి కృష్ణ నిర్మాతగా మారి పద్మాలయా బ్యానర్ పై తనే హీరోగా అనేక సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే రూట్ లో మహేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే మహేష్ సోదరుడు రమేష్ ఆల్రెడీ నిర్మాతగా ఫీల్డ్ లో కొనసాగుతున్నాడు. అలాగే మహేష్ సోదరి మంజుల సైతం నిర్మాతగా సినిమాలు తీస్తోంది. అయితే తన సొంత బ్యానర్ పెట్టుకుని వరసగా సినిమాలు చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లు చెప్తున్నారు. తన బ్రాండ్ ఇమేజ్ ని ఆ విధంగా వినియోగుంచుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
మహేష్ పెట్టబోయే ప్రొడక్షన్ హౌస్ కి ఆయన భార్య నమ్రత పూర్తి భాధ్యతలు వహించనుంది. మహేష్ పేరు చెపితే చాలా మంది ఫైనాన్సియర్స్ ముందుకు వస్తారనే అందుకే ఈ తరహాలో తనే నిర్మాతగా ఉండనున్నట్లు మహేష్ చెప్తున్నాడని తెలుస్తోంది. సంవత్సరానికి ఒక్క సినిమాని తన బ్యానర్ లో చేయాలనే ఆలచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంభంధించిన పూర్తి స్దాయి కార్యాచరణ ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం మహేష్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. దూకుడు చిత్రం నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాతగా అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ కూడా జరుగుతోంది. రీసెంట్ గా ఆ చిత్రం ఫస్ట్ లుక్ ప్రోమోని విడుదల చేస్తే భారీ రెస్పాన్స్ వచ్చింది.