Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ VS అల్లు అర్జున్: బాక్సాఫీస్ యుద్దానికి కారణం అదేనట.. సూపర్స్టార్ ఏమన్నారంటే
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ రంజుగా మారబోతున్నట్టు కనిపిస్తున్నది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రజనీకాంత్ లాంటి అగ్రహీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. అయితే తాజాగా ఒకే రోజు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు రిలీజ్ కానుండటంతో ఈ పోటీ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ పోటీకి అసలు కారణమేమిటంటే..
రిలీజ్ డేట్ల మార్పు
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరూ మూవీ జనవరి 11న రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆ తర్వాత అల వైకుంఠపురంలో చిత్రం జనవరి 14 రిలీజ్ చేయాలనే ప్లాన్తో చిత్ర యూనిట్లు ఉండేవి. కానీ ఒక్కసారిగా గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్లను మార్చడంతో బాక్సాఫీస్ వద్ద వార్కు తెరలేపారు.
ఒకే రోజు రిలీజ్ డేట్స్
ఇక అంతా సవ్యంగా ఉందనుకొన సమయంలో అల వైకుంఠపురం సినిమా రిలీజ్ డేట్ను ముందుకు జరిపి జనవరి 12కు తీసుకరావడంతో వివాదం మొదలైంది. అల వైకుంఠపురం డేట్ మార్చగానే పోటీగా సరిలేరు నీకెవ్వరు సినిమా డేట్ను వెనకకు జరిపి జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో రెండు భారీ సినిమాల మధ్య పోటీ ఏర్పడింది.
సోషల్ మీడియా వార్
మహేష్బాబు, అల్లు అర్జున్ సినిమా పోటీ పక్కన పెడితే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఘర్షణకు దారి వేసింది. నెటిజన్లు ఈ రెండు సినిమాల గురించి ఒకరిపై ఒకరు వాగ్భాణాలు వదులుకొంటూ మరో వివాదాన్ని రాజేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో గత కొదిరోజులుగా కామెంట్లు విపరీత ధోరణితో కనిపిస్తున్నాయి.
ఫ్యాన్స్ గర్వపడేలా
ఇదిలా ఉండగా.. ఇటీవల విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు సినిమాపై స్పందించారు. నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. సరిలేరు నీకెవ్వరు చిత్రం మాత్రం అభిమానులు గర్వపడేలా ఉంటుంది అని మహేష్ చెబుతూ ఫ్యాన్స్ను ఉత్తేజ పరిచారు.