Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
500 కోట్ల బడ్జెట్ సినిమాకు అల్లు అరవింద్ ప్లానింగ్, ప్రభుత్వంతో ఒప్పందం..వెండి తెరపై రామాయణం!
Recommended Video
ఇప్పుడున్న టెక్నాలజీతో రామాయణం, మహాభారతం వంటి పురాణాల్ని వెండి తెర అద్భుతాలుగా మలచవచ్చు. యుద్దాలు, రాజులు నేపథ్యంలో రాజమౌళి బాహుబలి చిత్రం ఎలాంటి అద్భుతాలు చేసిందో అందరికి తెలిసిందే. కాగా మహా భారత కావ్యాన్ని ఇప్పటి టెక్నాలజీతో వెండి తెరపై ఆవిష్కరించాలని రాజమౌళి వంటి దర్శకుల మదిలో ఉంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతోందో కానీ.. రామాయణాన్ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి తొలి అడుగు పడింది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇందులో భాగస్వామిగా ఉండడం విశేషం.
రామాయణానానికి తొలి అడుగు
మహాభారతం, రామాయణాలు హిందువులకు పవిత్ర గ్రంధాలు. ఈ పురాణాల్లో అద్భుత చిత్రంగా మలచడానికి దర్శకులకు కావాల్సినంత కంటెట్ ఉంది. మహా భారతాన్ని వెండితెర పై ఆవిష్కరించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ రామాయణాన్ని సినిమాగా తీయడానికి తొలి అడుగు పడింది.
500 కోట్ల బడ్జెట్
రామాయణాన్ని దాదాపు రూ 500 కోట్లతో నిర్మించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పదం జరగడం విశేషం.
ఆ ముగ్గురూ
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా ఈ ఒప్పందాన్ని యూపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. యూపీ రాష్ట్రంలో సినిమా విభాగం అయిన ఫిల్మ్ బంధుతో ఎంఓయూ కుదిరింది.
మూడుభాషల్లో, త్రీడి
మూడు భాషల్లో, త్రీడి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది.
రాజమౌళి మహా భారతం ఎప్పుడు
పురాణగాధల సినిమా గురించి వార్తలు రాగానే అంతా రాజమౌళి వైపు చూస్తున్నారు. మహా భారతం సినిమాగా తీయడం తన జీవిత ఆశయం అని రాజమౌళి పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. రామాయణం చిత్రం గురించి వార్త రావడంతో మరో మారు రాజమౌళి మహా భారతం ఎప్పుడు అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.