Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
500 కోట్ల బడ్జెట్ సినిమాకు అల్లు అరవింద్ ప్లానింగ్, ప్రభుత్వంతో ఒప్పందం..వెండి తెరపై రామాయణం!
Recommended Video
ఇప్పుడున్న టెక్నాలజీతో రామాయణం, మహాభారతం వంటి పురాణాల్ని వెండి తెర అద్భుతాలుగా మలచవచ్చు. యుద్దాలు, రాజులు నేపథ్యంలో రాజమౌళి బాహుబలి చిత్రం ఎలాంటి అద్భుతాలు చేసిందో అందరికి తెలిసిందే. కాగా మహా భారత కావ్యాన్ని ఇప్పటి టెక్నాలజీతో వెండి తెరపై ఆవిష్కరించాలని రాజమౌళి వంటి దర్శకుల మదిలో ఉంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతోందో కానీ.. రామాయణాన్ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి తొలి అడుగు పడింది. టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఇందులో భాగస్వామిగా ఉండడం విశేషం.
రామాయణానానికి తొలి అడుగు
మహాభారతం, రామాయణాలు హిందువులకు పవిత్ర గ్రంధాలు. ఈ పురాణాల్లో అద్భుత చిత్రంగా మలచడానికి దర్శకులకు కావాల్సినంత కంటెట్ ఉంది. మహా భారతాన్ని వెండితెర పై ఆవిష్కరించాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ రామాయణాన్ని సినిమాగా తీయడానికి తొలి అడుగు పడింది.
500 కోట్ల బడ్జెట్
రామాయణాన్ని దాదాపు రూ 500 కోట్లతో నిర్మించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పదం జరగడం విశేషం.
ఆ ముగ్గురూ
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా ఈ ఒప్పందాన్ని యూపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. యూపీ రాష్ట్రంలో సినిమా విభాగం అయిన ఫిల్మ్ బంధుతో ఎంఓయూ కుదిరింది.
మూడుభాషల్లో, త్రీడి
మూడు భాషల్లో, త్రీడి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతోంది.
రాజమౌళి మహా భారతం ఎప్పుడు
పురాణగాధల సినిమా గురించి వార్తలు రాగానే అంతా రాజమౌళి వైపు చూస్తున్నారు. మహా భారతం సినిమాగా తీయడం తన జీవిత ఆశయం అని రాజమౌళి పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. రామాయణం చిత్రం గురించి వార్త రావడంతో మరో మారు రాజమౌళి మహా భారతం ఎప్పుడు అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.