Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అపార్టమెంట్లో నటి రేఖ అనుమానాస్పద మృతి, అంతా షాక్
త్రిసూర్: తమిళ నటి అనుమానాస్పద పరిస్దితుల్లో మరణించిన విషయం మరవక ముందే మరో నటి విషయం వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. అయితే ఈ సారి మలయాళి నటి రేఖా మోహన్ (45) మృతి చెందారు. ఆమె మృతి కూడా అనుమాన పరిస్దితుల్లోనే ఉండటం అందరినీ ఆలోచనలో,ఆందోళనలో పడేసింది.
మలయాళ మీడియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..నటి రేఖా మోహన్ కేరళ త్రిసూర్ లోని తన అపార్టమెంట్ లోని రేఖా శోభ సిటీ రెసిడెన్స్ ప్లాట్ లో మరణించి ఉంది. రేఖ భర్త ఆమెతో గత రెండు రోజులుగా ఫోన్ చేస్తూంటే ఎత్తటం లేదు. దాంతో ఆయన పోలీసులకు తెలియచేసారు. వెటనే పోలీసులు రంగంలోకి దిగ... తలుపులు బ్రద్దలు కొట్టి చూస్తే అక్కడ మరణించి ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియచేసారు. దాంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులందిరినీ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు.
అక్కడ పోలీసులు ఏమని చెప్తున్నారంటే...కేసు రిజిస్టర్ చేసి త్రిసూర్ మెడికల్ కాలేజికి పోస్ట్ మార్టం నిమిత్రం పంపామని అన్నారు. అయితే ఆమె మృతికు కారణమేమిటనేది ఇప్పటికీ తెలియలేదని, రకరకాల అనుమానాలు ఉన్నాయని, ఆ దిశగా ఇన్విస్టిగేషన్ జరుగుతోందని చెప్తున్నారు.అలాగే ఆమె భర్త ఎబ్రాడ్ లో ఉన్నారని, ఫోన్స్ కు ఆమె నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవటంతో తాము వెళ్లి తలుపులు బ్రద్దలు కొట్టి ఓపెన్ చేసామని చెప్పారు. ఆ అపార్టమెంట్ కు రెండు రోజుల క్రితం వచ్చింది.
రేఖా మోహన్ చాలా మలయాళ సినిమాలు, టీవీ సీరియల్స్లో నటించింది.ముఖ్యంగా ముమ్మట్టితో (ఉదయన్ పాలకన్), మోహన్ లాల్ తో (యాత్రమోజీ) చేసారు.