ప్రైవేట్ పార్టులో రాడ్.. శారీరక దాడితో నరకం.. తమిళ డైరెక్టర్పై యువ నటి సంచలన ఆరోపణలు
ACTRESS SOWMYA: ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగుతోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి రోజుకో సంచలన విషయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమిటీ నివేదిక తర్వాత చాలా మంది కథానాయికలు తమకు ఎదురైన ఘోరమైన అనుభవాన్ని చెప్పుకోవడంతో పాటు పలువురు పెద్ద దర్శకులు, నటీనటులు కూడా దాని ప్రభావంలోకి కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల, మలయాళ స్టార్ నివిన్ పౌలీపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తాజాగా మలయాళ నటి సౌమ్య తమిళ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేసింది.
తాజాగా నటి సౌమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను కూతురిలా చూసుకున్న దర్శకుడు తనను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధించాడని సౌమ్య చెప్పింది. ఆ దర్శకుడు వినోదం కోసం ఆమె ప్రైవేట్ పార్ట్స్లో రాడ్ని చొప్పించేవాడనీ , ఈ భయంకరమైన ఘటన నుంచి నుంచి కోలుకోవడానికి తనకు 30 ఏళ్లు పట్టిందని నటి తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 18 ఏళ్ల వయసులో తొలిసారి దర్శకుడిని కలిశానని సౌమ్య తెలిపింది. కానీ, సౌమ్య ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు. ఆ నటి వెల్లడించిన విషయాలు షాకింగ్గా ఉన్నాయి.

సౌమ్య మాట్లాడుతూ.. 'ఒక రోజు ఆ దర్శకుడి భార్య ఇంట్లో లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించారు. అతను నన్ను తన కుమార్తె అని చెప్పుకుంటేనే లైంగికదాడి చేసేవాడు. ఈ విషయాన్ని నా స్నేహితులకు చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాను.కానీ చెప్పలేకపోయాను. నాకే సిగ్గుగా అనిపించింది. నేను ఏదో తప్పు చేశానని అనుకుంటారు.
తనతో అలా ప్రవర్తించవద్దని చాలా సార్లు ప్రాదేయపడ్డాను. కానీ ఏం మాత్రం మారలేదు. నెమ్మదిగా నన్ను తన బానిసగా మార్చుకున్నాడు. ఒకానొక సమయంలో అతను నాపై బలవంతం చేశాడు. నాపై అత్యాచారం చేశాడు. ఇలా ఏడాది పాటు దారుణానికి పాల్పడ్డాడు. నరకం చూపించాడు'అంటూ సంచలన విషయాలను వెల్లడించింది.
అతను తనని 'సెక్స్ బానిస' గా మార్చుకున్నాడనీ, ఆ తర్వాత తనతో బిడ్డను కనాలని చెప్పడం మొదలుపెట్టాడని పేర్కొనండి. హేమ కమిటీ నివేదిక తర్వాత ఏర్పాటైన ప్రత్యేక పోలీసు దళానికి ఆ డైరెక్టర్ పేరు వెల్లడిస్తానని సౌమ్య తెలిపారు. ప్రస్తుతం ఈ స్పెషల్ పోలీస్ ఫోర్స్ మలయాళ చిత్ర పరిశ్రమలో వెలుగులోకి వచ్చిన లైంగిక దోపిడీ, లైంగిక వేధింపుల కేసులను విచారిస్తోంది.

ఇదిలా ఉంటే.. దాదాపు ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదికను సిద్ధం చేసింది. మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్, వివక్ష, ఇతర సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులపై అధ్యయనం చేసిన తన నివేదికను కేరళ సీఎం విజయ్ కు అందించింది. అలాగే మహిళల పని షరతులు, జీతాలు, సహా పలు అంశాలను కూడా అధ్యయనం చేసింది. ఈ రిపోర్టు వెలువడిన నాటి నుంచి పలు సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











