Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
మరో హీరోయిన్ కిడ్నాప్కు కుట్ర.. నటి భావన కేసులో విచారణలో భయంకర నిజాలు..
మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో భయంకరమైన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సినీ నటి కిడ్నాప్ వ్యవహారంలో కీలక నిందితుడు పల్సర్ సుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు.
మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో భయంకరమైన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సినీ నటి కిడ్నాప్ వ్యవహారంలో కీలక నిందితుడు పల్సర్ సుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ఫిబ్రవరిలో చోటుచేసుకొన్న కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి బయటపడటంతో ఈ కేసును కేరళ పోలీసులు తిరగతోడిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్, దర్శకుడు నాదిర్ షా, పల్సర్ సునీలను విచారిస్తున్నారు.
సునీ చెప్పిన విషయాలతో షాక్
పోలీసుల విచారణలో నిందితుడు పల్సర్ సుని చెప్పిన విషయాలు షాక్ గురిచేశాయట. నాలుగేళ్ల క్రితం మరో సినీ నటిని కిడ్నాప్కు ప్రయత్నించామని పల్సర్ వెల్లడించినట్టు సమాచారం. కొందరు ఓ సినీ నటిని కిడ్నాప్ చేయాలనే పనిని అప్పగించినట్టు పోలీసులకు సుని తెలిపినట్టు తెలుస్తున్నది. కిడ్నాప్కు సంబంధించిన ఫొటోలు ఓ మెమొరీ కార్డులో ఉన్నాయని, అవి నటి కావ్య మాధవన్ షాప్లో దాచి పెట్టానని చెప్పాడు. దాంతో ఆమెకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
దిలీప్, నాదిర్ షాతో 13 గంటల విచారణ
తాజా ఆడియో టేపులు బయటపడిన తర్వాత మరోసారి కేసు విచారణ వేగం పుంజుకొన్నది. నటుడు దిలీప్, దర్శకుడు నాదిర్ షాను దాదాపు 13 గంటలపాటు విచారించారు. కేసు సంబంధించిన సమాచారాన్ని వారి నుంచి అడిగి తెలుసుకొన్నట్టు తెలుస్తున్నది.
పలు కోణాల్లో దర్యాప్తు..
భావన కిడ్నాప్కు సంబంధించిన వ్యవహారంలో పల్సర్ సుని నుంచి దిలీప్ కాల్ వెళ్లిందా? ఆ కాల్ను దిలీప్ రిసీవ్ చేసుకొన్నాడా? ఒకవేళ మాట్లాడితే వారి మధ్య సంభాషణ ఏం జరిగింది అనే కోణంలో కేసును విచారిస్తున్నారు.
ఆధారాల కోసం అన్వేషణ
భావన కిడ్నాప్ కేసుకు సంబంధించి ఓ ఫిర్యాదు నమోదైంది. ఎఫ్ఐఆర్ గానీ, దానికి సంబంధించిన విచారణ గానీ చేపట్టలేదు. తాజా ఆడియో టేపులు బయటకు రావడంతో ఈ కేసును పున:విచారణ చేపట్టామని కేరళ ఏడీజీపీ బీ సంధ్య చెప్పారు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు.