‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు' విడుదల తేదీ

By Bojja Kumar

Mallela Theerthamlo Sirimalle Puvvu
హైదరాబాద్ : మనసారా, బస్టాప్ లాంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీదివ్య ప్రధాన పాత్రలో గోదావరి సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం 'మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు'. క్రాంతి కథానాయకుడుగా నటిస్తున్న ఈచిత్రానికి జివి.రామరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

జక్కం జవహర్‌బాబు సమర్పణలో జి.ఉమాదేవి నిర్మించిన ఈ చిత్రంలో జూన్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ మనస్సును మించిన అందమైన ప్రపంచం ఏదీ లేదు. మనసుపెట్టి వెతికితే మన హృదయంలోనే అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించవచ్చు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అన్నారు.

యువతకు నచ్చే సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని నిర్మించామని, సినిమా చూస్తుంటే ఓ డైరీ చదువుతున్న అనుభవం ఎదురౌతుందని, ఓ యువతి జీవితంలో ప్రేమ తాలూకు అనేక అనుభవాల నేపధ్యంలో ఈ చిత్రాన్ని సరికొత్తగా నిర్మించే ప్రయత్నం చేశామని తెలిపారు.

జార్జి, రావురమేష్, సి.వి.ఎన్.రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి, సంగీతం: పవన్‌కుమార్, ఎడిటింగ్: ధరేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, నిర్మాత: ఉమాదేవి జి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.వి.రామరాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X