Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
మొహమాటానికి పోయి చేసే ఇలా..మమతా మోహన్ దాస్
జీవితంలో ఒకటి రెండు సార్లు మొహమాటానికి పోయి సినిమాలు చేయడం జరిగిందని తను భావిస్తున్నట్లు మమతా మోహన్ దాస్ తెలిపారు. తన సినిమాలు కొన్ని భాక్సా ఫీస్ వద్ద నెగిటివ్ ఫలితాన్ని చూపటానికి కారణంగా ఆమె చెప్పుకొచ్చారు. గాయనిగానే కాక నటిగా కూడా అవకాశాలు తగ్గటాన్ని ఆమె సమీక్షించుకుంది. అయితే గత ఏడాదిలో పది, ఇరవై ఆఫర్ల వరకూ వచ్చాయని...కథలు అంతగా నచ్చకపోవడం వలన చేయలేకపోయానని ఆమె అన్నారు. ప్రస్తుతం నాగార్జున సరసన కామాక్షి కళా మూవీస్ చిత్రంలో ఆమె చేస్తున్నారు. మలయాళంలో ఒక సినిమా సెట్స్పై ఉంది. మొన్న స్టార్నైట్లో దేవిశ్రీ ప్రసాద్తో కలిసి 'రాఖీ రాఖీ రాఖీ నా కవాసాకీ...', 'ఆకలేస్తే అన్నం పెడతా...' పాటల్ని ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన 'బిందాస్' ఆడియో వేడుకకు అతిథిగా హాజరయ్యారు మమతా.ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఇక మమతా మోహన్ దాస్ ఇప్పటి వరకూ తెలుగులో యమదొంగ,కృష్ణార్జున,విక్టరీ,హోమం,చింతకాయిల రవి,కింగ్ తదితర చిత్రాలు చేసారు. ఇంతకీ ఆమె మొహమాటికి పోయి చేసి కెరీర్ పోగొట్టుకున్న సినిమాలు ఏమిటో...