twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమత 'బేజారు'

    By Staff
    |

    'రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి' అంటూ వైవిధ్యమైన స్వరంతో అందరి దృష్టిని ఆకర్షించి, ఆ పై 'యమదొంగ' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన తార మమత మోహన్ దాస్. ఆ చిత్రం హిట్ అవడంతో ఈ మళయాలి ముద్దుగుమ్మ ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. యమదొంగ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా రాణించిన మమతకు అటు పై అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి.

    ఈ కోవలో ఆమె 'చింతకాయల రవి', 'కింగ్' చిత్రాలలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో అన్నీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే రావడంతో మాతృభాష మళయాలం చిత్రాలపై దృష్టిసారించింది. ఈ మధ్యే విడుదలైన ప్యాసింజర్ చిత్రం విజయవంతం కావడంతో పాటు మంచి ప్రాధాన్యం వున్న పాత్రలు వస్తుండటంతో మళయాలీ చిత్రాలపైనే దృష్టిసారిస్తోందిట.

    ఈ మధ్యే ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తూ నా సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేకే తెలుగు చిత్రాలను అంగీకరించడం లేదని వ్యాఖ్యానించిదట. ప్రస్తుతం మళయాలీ స్టార్ హీరో దిలీప్ సరసన ఓ చిత్రాలన్ని చేస్తూ బిజీగా వున్న మమత చేతిలో ఇంకా రెండు మూడు చిత్రాలు వున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X