Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మమత 'బేజారు'
'రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి' అంటూ వైవిధ్యమైన స్వరంతో అందరి దృష్టిని ఆకర్షించి, ఆ పై 'యమదొంగ' చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన తార మమత మోహన్ దాస్. ఆ చిత్రం హిట్ అవడంతో ఈ మళయాలి ముద్దుగుమ్మ ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. యమదొంగ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా రాణించిన మమతకు అటు పై అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి.
ఈ కోవలో ఆమె 'చింతకాయల రవి', 'కింగ్' చిత్రాలలో సెకెండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో అన్నీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే రావడంతో మాతృభాష మళయాలం చిత్రాలపై దృష్టిసారించింది. ఈ మధ్యే విడుదలైన ప్యాసింజర్ చిత్రం విజయవంతం కావడంతో పాటు మంచి ప్రాధాన్యం వున్న పాత్రలు వస్తుండటంతో మళయాలీ చిత్రాలపైనే దృష్టిసారిస్తోందిట.
ఈ మధ్యే ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ప్రాధాన్యం లేని పాత్రలు చేస్తూ నా సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేకే తెలుగు చిత్రాలను అంగీకరించడం లేదని వ్యాఖ్యానించిదట. ప్రస్తుతం మళయాలీ స్టార్ హీరో దిలీప్ సరసన ఓ చిత్రాలన్ని చేస్తూ బిజీగా వున్న మమత చేతిలో ఇంకా రెండు మూడు చిత్రాలు వున్నాయి.