Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రగ్స్ రాకెట్లో హీరోయిన్, నిఘా పెట్టిన పోలీసులు!
హైదరాబాద్: 90వ దశకంలో బాలీవుడ్ను తన హాట్ అండ్ సెక్సీ అందాలతో ఊర్రూతలు ఊగించిన ఘనత మమత కులకర్ణి సొంతం. అప్పట్లో దాదాపు 11 ఏళ్ల పాటు ఆమె తన హవా కొనసాగించారు. అయితే ఆ తర్వాత హోటల్ వ్యాపారానికి పరిమితం అయి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. అనంతరం తన ప్రియుడు వికీ గోస్వామిని పెళ్లాడారు.
మమత కుల కర్ణి, వికీగోస్వామి మధ్య చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగింది. వీకీ గోస్వామిని 1997లో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడగా...ఇస్లాం మతంలోకి మారడంతో పదేళ్లు శిక్ష తగ్గించి 2012లో విడుదల చేసారు.
పెళ్లి తర్వాత తర్వాత ఇద్దరూ కెన్యాలోని నైరోబీకి మకాం మార్చి అక్కడ కూడా డ్రగ్స్ అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు. గతంలో వికీ గోస్వామి డ్రగ్స్తో కెన్యా పోలీసులకు పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇపుడు మమత కులకర్ణి పేరు కూడా డ్రగ్స్ రాకెట్లో బయట పడింది. ఆమె నిషేదిత మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు ఆమెపై నిఘా పెట్టారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేదిత ఎఫిడ్రిన్ మత్తు పదార్థాన్ని సీజ్ చేసారు. ఈ స్మగ్లింగులో మమత భర్త విక్కీ గోస్వామి కీలకపాత్రధారి అని పోలీసులు వెల్లడించారు.
విక్కీ గోస్వామిపై ఇంటర్ పోల్ నోటీసు ఉండటంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాలో కార్యకలాపాలు చూసే బాధ్యత భార్య విక్కికి అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్రలోనూ ఆమె డ్రగ్స్ నెట్వర్క్ నడుపుతున్నట్లు అనుమానిస్తున్నారు.
వికీ గోస్వామి చాలా కాలంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నా...ఆయన భార్య మమత కులకర్ణి పేరు బయటకు రాలేదు. అయితే ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మమత కులకర్ణి కూడా ఈ డ్రగ్స్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయిందనే విషయం బయటకు వచ్చింది.