Don't Miss!
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆస్కార్ నామినేషన్ ఎంట్రి: తెలుగు నుంచి ఇవే...
హైదరాబాద్ : ఆస్కార్ అవార్డుల పండుగకు అప్పుడే హడావిడి మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీకి పంపే చిత్రాలను ఎంపిక చేసే పనిలో స్క్రీనింగ్ కమిటీ బిజీ అయిపోయింది. ఉత్తమం విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరుపున అథికారిక ఎంట్రీగా 30 సినిమాలును మన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. వాటిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.
ఆ తెలుగు సినిమాలులో ఒకటి మనం, మరొకటి మిణుగురులు. అలాగే ఇతర భాషా చిత్రాలను పరిశీలిస్తే...ఇప్పటికే జాతీయ అవార్డును కైవసం చేసుకున్న బెంగాళీ చిత్రం జతీశ్వర్, మరాఠీ చిత్రం ఫండ్రీ, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ చిత్రం షాహిద్ లు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే మర్ధానీ, ఫిల్మీస్దాన్, సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా, మేరీ కోమ్ కూడా ఉన్నాయి. ఇక తమిళం నుంచి కొచ్చడయనా, కదై తిరక్కదై వసనమ్ ఇయక్కమ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కొంకణీ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.
ఎఫ్. ఎఫ్. ఐ నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ బుధవారం నుంచీ ఈ చిత్రాలన్నీ చూసి, మన దేశం నుంచి పంపే ఎంట్రీని ఖరారు చేస్తుంది. ఈ సినిమాలు స్క్రీనింగ్ లు అన్ని హైదరాబాద్ లోజరగనున్నాయి. అన్ని చిత్రాలునూ కమిటీ చూసి, ఈ నెల 23 నుంచి తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తాయి.
ఇక మన తెలుగు చిత్రాలు విషయానికి వస్తే..మనం చిత్రం అక్కినేని నాగేశ్వరరావుగారి ఆఖరి చిత్రం. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మూడు తరాల నటులు అంటే నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటించటం విశేషం. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
మిణుగురులు విషయానికి వస్తే... అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శక నిర్మాతగా 40 మంది అంధ బాలలతో తెరకెక్కించిన చిత్రం `మిణుగురులు'. రెస్పెక్ట్ క్రియేషన్స పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, సుహాసిని మణిరత్నం, రఘువీర్ యాదవ్, దీపక్, రుషిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ టెక్నీషియన్స పనిచేశారు. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికే ఏడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్సకి ఈ చిత్రం ఎంపికైంది. 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఎన్.వి.బి. చౌదరి కథ అందించారు. ఈ చిత్రం కథ, కథనం అందరి ప్రశంసలు పొందింది.