Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ ప్రారంభం, నాగ్ ట్వీట్
హైదరాబాద్ : చాలా కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' మొత్తానికి ఈ రోజు మొదలయింది. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.
ఇది
వరకు
'ఇష్క్'
లాంటి
హిట్
చిత్రాన్ని
తెరకెక్కించిన
విక్రమ్
కుమార్
ఈ
చిత్రానికి
దర్శకత్వం
వహిస్తున్నారు.
ఈచిత్ర
ప్రారంభోత్సవ
పూజా
కార్యక్రమం
సోమవారం
అన్నపూర్ణ
స్టూడియోలో
చాలా
సింపుల్
గా
జరిగింది.
ఈ
చిత్రంలో
నాగార్జున
సరసన
శ్రీయ,
నాగ
చైతన్య
సరసన
సమంత
హీరోయిన్లుగా
నటించనున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి హీరో నాగార్జున తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ రోజు మనం సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అమ్మ గుర్తుకు వచ్చింది. కాస్త ఎమోషనల్ అయ్యా' అంటూ ట్వీట్ చేసారు . ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు. అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.