twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ ప్రారంభం, నాగ్ ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : చాలా కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' మొత్తానికి ఈ రోజు మొదలయింది. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

    ఇది వరకు 'ఇష్క్' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రీయ, నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటించనున్నారు.

    Manam

    ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి హీరో నాగార్జున తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ రోజు మనం సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అమ్మ గుర్తుకు వచ్చింది. కాస్త ఎమోషనల్ అయ్యా' అంటూ ట్వీట్ చేసారు . ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

    ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు. అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    English summary
    Three generation of stars in Akkineni's family have teamed up for the first time for the film titled Manam. Legendary Akkineni Nageshwara Rao and his son Nagarjuna and grandson Naga Chaitanya are sharing screen together as lead actors in this film being directed by Vikram Kumar of Ishq fame.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X