Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లక్ష్మీ ప్రసన్న నిజం నిర్మాత కాదు... ఆమె కేవలం నటిస్తోంది..
'కథలో రాజకుమారి' సినిమాలో నారా రోహిత్ సినీ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట.ఇందులో కొందరు నటీనటులు.. సాంకేతిక నిపుణులు తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలే చేస్తుంటాడు యువ కథానాయకుడు నారా రోహిత్. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వకున్నా అతను వెనకడుగు వేయలేదు. తాజాగా 'జ్యో అచ్యుతానంద' లాంటి వైవిధ్యమైన సినిమాతో పలకరించాడు. హిట్టు కొట్టాడు. ఆ సినిమాలో రోహిత్ నటనకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ఊపులో తన కొత్త సినిమాల్ని చకచకా పూర్తి చేసేస్తున్నాడు రోహిత్. 'అప్పట్లో ఒకడుండేవాడు' విడుదలకు సిద్ధమవుతుండగా.. 'కథలో రాజకుమారి' కూడా ముగింపు దశకు వచ్చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు బయటికి వచ్చాయి.
'కథలో రాజకుమారి' సినిమాలో నారా రోహిత్ సినీ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట.ఇందులో కొందరు నటీనటులు.. సాంకేతిక నిపుణులు తమ నిజ జీవిత పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది మంచు లక్ష్మి గురించే. ఈ చిత్రంలో హీరో నటించే ఓ సినిమాకు నిర్మాతగా కనిపిస్తుందట మంచు లక్ష్మీ ప్రసన్న.ఇలాంటి గెస్ట్ రోల్స్ ను నాగశౌర్య, అదా శర్మ పోషిస్తున్నారు.
ఇప్పుడు మంచు లక్ష్మి తోడయ్యారు. ఇక అవసరాల శ్రీనివాస్ కూడా ఇలాగే ఓ క్యారెక్టర్ లో కనిపిస్తారు. మరి కొందరు సినిమా జనాలు కూడా తమ రియల్ క్యారెక్టర్లలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో కథ ప్రకారం నారా రోహిత్ సినిమా నటుడు. అందుకే ఇలాంటి టచ్ క్యారెక్టర్లు చాలా అవసరం పడుతున్నాయని తెలుస్తోంది.. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో 'చుట్టాలబ్బాయి' ఫేమ్ నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత.
గత ఏడాదే మొదలైన ఈ సినిమా కొంచెం ఆలస్యమవుతోంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన మలయాళ అమ్మాయి నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పటికే 'చుట్టాలబ్బాయి' సినిమా చేసింది. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో 'చుట్టాలబ్బాయి' ఫేమ్ నమిత ప్రమోద్ కథానాయికగా నటిస్తోంది. వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.