Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్రామీణ యువతిగా మంచు లక్ష్మి కేక
హైదరాబాద్ : ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం సినిమా ఫలితం ఎలా ఉన్నా మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయన్నది మాత్రం నిజం. ఇప్పుడామె తాజాగా తమ బ్యానర్ లో తనే నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి'లో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా అదరకొట్టనుందని సమాచారం. ఈ మేరకు విడుదల చేసిన ఫోటోలు అందరి ప్రశంసలు పొందుతున్నాయి. ఈ చిత్రంలో ఆమె ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ లో కనపడి తన అభిమానులను అలరించనుంది. ఆది, తాప్సీ, మంచు లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా కుమార్నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గుండెల్లో గోదారి'. మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.
'టైటానిక్' సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా షిప్ మునిగిపోవడమే గుర్తొస్తుంది. కానీ అది గొప్ప ప్రేమకథ. 'గుండెల్లో గోదారి' కూడా అదే కోవకు చెందిన సినిమా. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్'' అని ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న ఆది పినిశెట్టి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ-''ఈ సినిమాని తను ఎలా తీయబోతున్నాడో కొన్ని ఉదాహరణలు చెప్పాడు దర్శకుడు కుమార్నాగేంద్ర. గతంలో వచ్చిన ఉప్పెనల తాలూకు ఫొటోలను చూపించడంతో పాటు, తను చేసిన పరిశోధన గురించి కూడా చెప్పాడు. దాంతో ఈ సినిమా చేస్తే వర్క్అవుట్ అవుతుందనిపించింది. లొకేషన్కి వెళ్లాక అతని టేకింగ్ స్టైల్ నా నమ్మకాన్ని రెట్టింపు చేసింది'' అన్నారు.
ఈ చిత్రం కథ గురించి హీరో ఆది పనిశెట్టి మాట్లాడుతూ -''దివిసీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. ఈ కథలో అంతర్లీనంగా రెండు ప్రేమకథలుంటాయి. నేను, తాప్సీ ఓ జంట అయితే... నేను, లక్ష్మీప్రసన్న మరో జంట. అందుకని ఇది ముక్కోణ ప్రేమకథకాదు. ఇద్దరితో నేను సాగించే ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుంది'' అని చెప్పా రు. మా నాన్న, మోహన్బాబుగారి కాంబినేషన్లో పెదరాయుడు, ఎం ధర్మరాజు ఎంఎ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలొచ్చాయి. అలాంటి బేనర్లో నటించడం నాఅదృష్టం'' అన్నారు.
అలాగే ''గోదావరి నేపథ్యంగా సాగే కథ కాబట్టి సినిమా ఎక్కువగా నీటిలోనే తెరకెక్కించారు. చాలాసేపు నీళ్లలోనే ఉండాల్సి వచ్చేది. కొన్నిసార్లు సమస్యలూ ఎదురయ్యాయి. కానీ గోదావరి ప్రయాణం ఓ తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన పాత్ర గురించి చెబుతూ -''ఇందులో మత్యకారుని పాత్ర. పేరు మల్లిగాడు. ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడతాను'' అని తెలిపారు. మా నాన్న, మోహన్బాబుగారి కాంబినేషన్లో పెదరాయుడు, ఎం ధర్మరాజు ఎంఎ లాంటి సక్సెస్ఫుల్ సినిమాలొచ్చాయి. అలాంటి బేనర్లో నటించడం నాఅదృష్టం'' అన్నారు.