Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
“యాందిరో మీ మగాళ్లలో...” అంటూ హస్కీగా మంచు లక్ష్మి (వీడియో)
హైదరాబాద్ : మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించి, నిర్మిస్తున్న సినిమా ‘దొంగాట'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ ని పెంచారు. అందుకోసం మంచు లక్ష్మి చేత తొలిసారిగా ఓ పాట పాడించారు. "యాందిరో మీ మగాళ్లలో అంత ఇర్రవీగిపోయే గొప్ప..." అంటూ సాగే ఆ పాటను మీరు చూస్తూ, విని ఎంజాయ్ చేైయండి.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
లక్ష్మి మంచు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుండి ఇదివరకు వచ్చిన ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ‘గుండెల్లో గోదారి' సినిమాలకు భిన్నంగా ‘దొంగాట' వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో ఓ ప్రత్యేక సందర్భంలో నాగార్జున, రవితేజ, రానా, నాని, శింబు, సుధీర్బాబు, నవదీప్, సుశాంత్, తాప్సీ పలువురు కనిపిస్తారు. ఓ కీలక సన్నివేశం కోసం వారిని అడగ్గానే ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. దర్శకుడు వంశీ చక్కని కథ చెప్పాడు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.
వంశీకృష్ణ మాట్లాడుతూ ‘‘మాటల సందర్భంలో లక్ష్మికి కథ చెప్పాను. వెంటనే చేసేద్దాం అంది. కామెడీ నేపథ్యంలో ఇదొక కొత్త సినిమా అవుతుంది'' అని అన్నారు. ‘‘తొలిసారి కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదొక కొత్త అనుభూతి. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుంది'' అని అడివి శేష్ తెలిపారు.
‘గుండెల్లో గోదారి' లాంటి ఫీల్ గుడ్ మూవీ తర్వాత మంచు ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తాను నిర్మిస్తున్న సినిమా ఇదని లక్ష్మీ మంచు తెలిపారు. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో నాగార్జున, రవితేజ, రానా, శింబు సహా పది మంది హీరోలు నటించబోతున్నారని, అన్నీ అనుకూలిస్తే... ఏప్రిల్ 16న సినిమాను విడుదల చేస్తామని మంచు లక్ష్మి తెలిపారు!
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా అతిధి పాత్రలో నటించారు.మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను మంచు లక్ష్మి స్వయంగా నిర్మిస్తున్నారు.