వచ్చే నెల నుంచే నిర్మాతగా మంచు లక్ష్మీ ప్రసన్న రెండో చిత్రం
'ఝుమ్మంది నాదం' చిత్రంతో నిర్మాతగా తెరంగ్రేటం చేసిన మంచు లక్ష్మీ ప్రసన్న వచ్చే నెల నుంచి రెండో చిత్రం ప్రారంభించనుంది. ఆ కొత్త చిత్రం టైటిల్ 'వూ కొడతారా...ఉలిక్కిపడతారా'. ఈ చిత్రం గురించి అందులో హీరోగా చేస్తున్న మంచు మనోజ్ మాట్లాడుతూ.....సినిమా అంతా ఉలిక్కిపడేలాగే ఉంటుంది. ఈ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కృష్ణవంశీ శిష్యుడైన రాజాను దర్శకునిగా పరిచయం చేస్తూ ఉంటుంది. అలాగే ఆ చిత్రం కచ్చితంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందే ప్రమాణాలతో ఆ చిత్రం ఉంటుంది అంటున్నారు. అలాగే కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఈ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంతో హీరోగా సెటిల్ అవుతాడేమో చూడాలి.
More from Filmibeat
లక్ష్మీ ప్రసన్న వూ కొడతారా... ఉలిక్కిపడతారా మనోజ్ కుమార్ షీనా బిందాస్ lakshmi prasanna manoj kumar sheena bindaas raghavendra rao


Click it and Unblock the Notifications











