twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీవారి చెంతకు కాలినడకన భర్తతో మంచు లక్ష్మి(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తిరుమల శ్రీవారి(శ్రీ వెంకటేశ్వరస్వామి) దర్శనం నిమిత్తం నటి, నిర్మాత మంచు లక్ష్మి కాలినడకన తిరుమల చేరుకున్నారు. తన భర్త ఆండీ శ్రీనివాసన్‌‌తో కలిసి మెట్ల మార్గంలో కాలినడక సాగించారు. ఆదివారం రాత్రి నడక ప్రారంభించి గురువారం ఉదయం కొండపైకి చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. ఎప్పుడూ ఒంటరిగానే బయట కనిపించే మంచు లక్ష్మి ఈ సారి భర్తతో మీడియా కంట పడటం చర్చనీయాంశం అయింది.

    ప్రముఖ నిర్మాత మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    మంచు లక్ష్మి సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు....భర్తతో ఆమె కలిసి ఉన్న ఫైల్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం

    నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం

    నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం


    ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి సినిమా అనగనగా ఓ ధీరుడు చిత్రంలో విలన్‌గా నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్న మంచు లక్ష్మి...ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి' చిత్రంతో మంచి ప్రశంసలు అందుకుంది.

    చందమామ కథలు

    చందమామ కథలు


    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రానికి చందమామ కథలు అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రానికి చాణక్య బూనేటి నిర్మాత. చైతన్యకృష్ణ, నరేష్, అమని, కృష్ణుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    రాయలసీమ

    రాయలసీమ


    త్వరలో మంచు లక్ష్మి ‘రాయలసీమ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన మంచు లక్ష్మి లుక్ పేయింటింగ్ పోస్టర్ రూపంలో విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.

    వీర వనితగా

    వీర వనితగా


    ‘రాయలసీమ' చిత్రం ఒక పురాణ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు మంచు లక్ష్మి తన ట్విట్టర్లో వెల్లడించింది. ఇందులో ఆమె ‘మున్నెమ్మ' అనే వీర వనిత గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ పౌరుషం, పగలు లాంటి కథాంశంతో ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రం కూడా మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో తెరకెక్కనున్నట్లు చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ ఖరారైన తర్వాత సినిమా గురించి అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది.

    English summary
    Tollywood actress Manchu Lakshmi Prasanna visits Tirumala along with her husband Andy Srinivasan today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X