Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కిడ్నీ ఆముకున్నాను.. మా నాన్న మాత్రమే రిచ్ అంటూ మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్
మంచు మోహన్ బాబు వారి అమ్మాయి లక్ష్మీ మంచు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఆమె ఎలాంటి పోస్ట్ చేసినా కూడా చాలా ఈజీగా వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా చిన్న విషయం చెప్పినా కూడా లక్ష్మీ నలుగురి ఫోకస్ పడేలా చూసుకుంటోంది. ఇక రీసెంట్గా హాలిడేస్ కోసం విదేశాలకు బయలుదేరిన మంచు లక్ష్మి ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో స్పందించింది. ఇక అందుకు సంబంధించిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఓటీటీ కంటెంట్ ద్వారా
మంచు లక్ష్మి కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా హోస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ఇటీవల కాలంలో ఆమె సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ కూడా ఓటీటీ కంటెంట్ ద్వారా ఎక్కువగా జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తోంది. కేవలం వెబ్ సిరీస్ ను మాత్రమే కాకుండా వివిధ రకాల రియాలిటీ షోలోలో కూడా మంచు లక్ష్మి తనదైన శైలిలో క్రేజ్ అందుకుంటోంది.
పర్సనల్ హాలిడే..
ఇక గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కేటాయించిన మంచులక్ష్మి రీసెంట్గా తన వ్యక్తిగత జీవితం కోసం సమయం కేటాయించడానికి హాలిడేస్ కు బయలుదేరింది. ఫారిన్ ట్రిప్ వెళ్తున్నట్లు తెలియజేసిన మంచు లక్ష్మి ఏ దేశానికి వెళుతుందో మాత్రం చెప్పలేదు. కానీ తన ట్రావెలింగ్ కు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది.
కిడ్ని అమ్ముకున్నా..
ఇక ఇటీవల ఎయిట్ పోర్ట్ లో మంచు లక్ష్మి లాంజ్ లో ఆకలి పెద్దగా వేయకపోయినా తిన్నట్లు చెప్పింది. ఎందుకంటే ఆ టికెట్ కొనేందుకు తన కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చినట్లు తెలిపింది. ఇక టికెట్ కొన్నందుకు న్యాయం చేయాలని అనుకున్నట్లు ట్వీట్ చేసింది. దాంతో మంచు లక్ష్మి చేసిన ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.
నేను రిచ్ కాదు..
ఎయిర్ పోర్ట్ లో టికెట్ రేటుపై మంచు లక్ష్మి వ్యంగ్యంగా అలా చెప్పినట్లుగా అర్ధమవుతోంది. అయితే ఆమె అలా ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నెటిజన్లు విభిన్నమైన తరహాలో కామెంట్ చేస్తున్నారు. మంచక్కా.. మీరు రిచ్ కదా అంటూ ఒక నెటిజన్ డైరెక్ట్ గా ప్రశ్నించగా అతనికి కూడా మంచు లక్ష్మి ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. నేను రిచ్ కాదు.. మా నాన్న మాత్రమే రిచ్ అంటూ మంచు లక్ష్మి కొంటెగా సమాధానం ఇచ్చింది.
హోమ్ టూర్ వీడియోస్
ఇక రీసెంట్ గా మంచు లక్ష్మి తన యూ ట్యూబ్ ఛానెల్స్ లో విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తోంది. ఆ మధ్య తన హోమ్ టూర్ వీడియోకు భారీ స్థాయిలో మిలియన్ వ్యూవ్స్ దక్కడంతో మళ్ళీ కళరీ విద్యకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఇక త్వరలోనే తన తండ్రి మోహన్ బాబు ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియోను కూడా పోస్ట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.