Don't Miss!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గర్వంగా ఉందంటూ...మంచు లక్ష్మి ఫుల్ హ్యాపీ..
హైదరాబాద్ : 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన వెలువడింది. ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఈ ఏడాది ఉత్తమ తెలుగు చలన చిత్రంగా 'చందమామ కథలు' ఎంపికైంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ సందర్బంగా చందమామ కథలకు జాతీయ అవార్డు రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిగా తనకెంతో గర్వంగా ఉందని ఈ చిత్రంలో నటించిన మంచు లక్ష్మీ అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ చందమామ కథలకు అవార్డు రావడం పట్ల తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ గర్వపడాల్సిన విషయమని అన్నారు. ఆ సినిమా బయటకు రావడానికి, ఆ చిత్రం చేయడానికి నిర్మాత, డైరెక్టర్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసునని ఆమె అన్నారు.
నేను చేసిన మొదటి చిత్రం ‘అనగా అనగా ఓ ధీరుడు'కు నంది అవార్డు వచ్చిందని, ‘గుండెల్లో గోదావరి'కి ఫేమా అవార్డు వచ్చిందని మంచు లక్ష్మీ తెలిపారు. అలాగే ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాకు అవార్డు వచ్చిందని, ఇప్పుడు చందమామ కథలకు జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని మంచు లక్ష్మీ తెలిపారు.
ఒక కొత్త కోణంతో నటించానని, అదోక కీలకమైన పాత్రని హీరో నరేష్ అన్నారు. అలాంటి ఆ చిత్రానికి జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఆ చిత్రంలో నేను ఒక పాత్ర చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కృష్ణుడు అన్నారు.