చిరంజీవి అంకుల్ తో ఆ షో చేస్తా: మంచు లక్ష్మీ ప్రసన్న
ఇంకో విషయం ఏంటంటే...త్వరలో మళ్లీ 'లక్ష్మీ టాక్ షో' మొదలుపెట్టబోతున్నాను. ఈసారి చిరంజీవి అంకుల్తో ఆ షో మొదలుపెట్టాలని ఉంది' అంటూ చిరంజీవి అనుమతిని సభాముఖంగా కోరారు మంచు లక్ష్మీ ప్రసన్న.ఆమె నిర్మిస్తున్న ఝుమ్మంది నాదం చిత్రం ఆడియో పంక్షన్ లో ఈ విషయం ప్రకటించారు. అలాగే...అమెరికాలో ఎంత సాధించినా నా సొంత గడ్డ మీద సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చిన కీరవాణిగారికి రుణపడి ఉంటాను. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. అంతరించిపోతున్న సంప్రదాయబద్ధమైన సంగీతం విలువ తెలియజెప్పాలనే ఆకాంక్షతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది అన్నారు. ఇక జీ ఛానెల్ లో వచ్చిన 'లక్ష్మీ టాక్ షో' మంచి పేరు తెచ్చుకుంది.
More from Filmibeat
లక్ష్మీ ప్రసన్న చిరంజీవి ఝుమ్మంది నాదం జీ ఛానెల్ కీరవాణి laxmi prasanna mohan babu chiranjeevi laxmi talk show


Click it and Unblock the Notifications











