Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వైఫ్ ఆఫ్ రామ్ స్టోరి రివీల్ చేసిన మంచులక్ష్మీ.. రిలీజ్కు ముందే డేరింగ్!
విజయ్ ఏలకంటి దర్శకత్వంలో మంచు లక్ష్మీ నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం జూలై 20న రిలీజ్కు సిద్ధమైంది. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా విశేషాలను, షూటింగ్ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాలను వివరించారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..
వైఫ్ ఆఫ్ రామ్ కొత్త జానర్
‘వైఫ్ ఆఫ్ రామ్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్. పాటలు, ఫైట్లు ఉండవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగులో జానర్స్ లో వచ్చే సినిమాలు తక్కువ. వైఫ్ ఆఫ్ రామ్ ఓ కొత్త జానర్ ను పరిచయం చేస్తూ వస్తోన్న సినిమా. ఈ కథ నేను వినగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇది నిజంగానే జరిగిన కథ. అందుకే ఈ కథను చాలా ప్రేమించాను నేను.
పాప్కార్న్ కొనే టైం ఉండదు
పాత్రలు పరిచయం చేయడం.. మెల్లగా సినిమా మూడ్ లోకి తీసుకువెళ్లడం వంటివేం ఉండవు. సీట్లో కూర్చోగానే అసలు కథ మొదలవుతుంది. పాప్ కార్న్ కొనుక్కునే టైమ్ కూడా ఉండదు. అంత వేగంగా కథలోకి వెళ్లిపోతారు. స్టార్ట్ అయిన మరుక్షణం నుంచే మీకు అద్భుతమైన థ్రిల్ఇస్తుంది.సినిమా నిడివి కూడా రెండు గంటల్లోపే ఉంటుంది. ఇది ఓ సాధారణ అమ్మాయి, మహిళ, గృహిణి ప్రయాణం. ఒక సంఘటన తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది అనేది నా పాత్ర.
కహానీకి సంబంధం ఉండదు
అయితే ఈ సినిమాకు బాలీవుడ్ కహానీకి ఈ సినిమాకూ ఏ సంబధం ఉండదు. నా పాత్ర పేరు దీక్ష. తను ఓ ఎన్జీవోలో పనిచేస్తుంటుంది. తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే.. బాబాయ్ ఇంట్లో పెరుగుతుంది. తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని.. హ్యాపీగా ఉంటోన్న టైమ్ లో సడన్ గా దీక్ష జీవితంలో జరిగిన సంఘటన ఎలాంటి మార్పులు తెచ్చింది. సామాజికంగానూ తనకు ఏ సహాయం దొరకనప్పుడు తను న్యాయం కోసం ఏం చేసింది అనేది ఈ దీక్ష కథ. సింపుల్ గా ఇది ఓ భార్య కథ.
దీక్ష పాత్ర కోసం కష్టపడ్డా
ఇక దీక్ష పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఇలాంటి పాత్ర చేయడం ఓ ఛాలెజింగ్ లాంటిది. అందుకే ఎక్కువ ఇష్టపడి చేశాను. మొత్తంగా ఇలాంటి సినిమా తెలుగులో రావడం ఇదే మొదటిసారి. ప్రేక్షకులను పూర్తిగా థ్రిల్ చేస్తుంది. ఆ థ్రిల్ ను మిస్ అవకూడదంటే ఈ నెల 20న ప్రతి ఒక్కరూ మా సినిమాను థియేటర్ లోనే చూడాలి''. అని ముగించారు మంచు లక్ష్మి.