Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కులం పంచాయితీ: మారకపోతే ‘జి’లో కొట్టి జైలుకు పోతానంటున్న మంచు మనోజ్
Recommended Video
మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుమార్ పరువు హత్యోదంతంపై స్పందిస్తూ టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ట్విట్టర్లో చేసిన పోస్టుపై రకరకాల అభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. కులం ఫీలింగ్ ఎక్కడ ఉన్నా అది చాలా దారుణం. సినిమా పరిశ్రమలో తమ కులం హీరోలను అభిమానించడమైనా, కులం ప్రాతిపదికన పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వడమైనా, కులం ఆధారంగా ఏర్పడే కాలేజ్ యూనియన్స్ అయినా, మరే ఇతర కుల, మత సంఘాలైనా సమాజంలో క్రూరమైన పరిస్థితులకు కారణం అవుతున్నాయని, అలాంటి కులం పిచ్చోళ్లు ఉండబట్టే ప్రణయ్ హత్య జరిగిందని మనోజ్ అభిప్రాయ పడ్డారు.
|
మనోజ్ మీద ట్రోలింగ్
అయితే ఈ విషయంలో మనోజ్ను కొందరు ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈ మంచు స్టార్. తనతో ఈ విషయమై వాదించిన ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ నీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తే నా అసలైన భాషలో మాట్లాడతాను అంటూ మనోజ్ మండి పడ్డారు.
మారకపోతే కొట్టి జైలుకు పోదాం
ఈ కులం పిచ్చోళ్లు ఎప్పటికీ మారరు అన్నా... వారిని వదిలేయ్ అని ఓ అభిమాని వ్యాఖ్యానించగా దానికి మనోజ్ రిప్లై ఇస్తూ... ‘‘వాళ్లు మారక పోతే ‘జి'లో కొట్టి జైలుకు పోదాం, తొక్క'' అంటూ రిప్లై ఇచ్చారు.
|
కులం పిచ్చోళ్లపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్
తాను ఎన్ని చెప్పినా కొందరు కులం పిచ్చోళ్లు తమ వితండవాదం వినిపిస్తుండటంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మనోజ్ ట్వీట్ చేశారు. మీ లాంటి వారు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వేరే కులానికి చెందిన డాక్టర్ దగ్గరకు ఎందుకు వెళుతున్నారంటూ మనోజ్ ప్రశ్నించారు.
|
ప్రణయ్ హత్యపై మనోజ్ ట్వీట్
ప్రణయ్తో పాటు ఎంతో మందిని బలిగొన్న ఈ పరిణామాలకు కులాలను, మతాలను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులే. అలాంటి కులం, మతం పిచ్చోళ్లు సమాజంలో ఉండటం వల్లనే ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయని మనోజ్ అన్నారు. మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. తన తండ్రిని స్పర్శించక ముందే ఒక బిడ్డ కన్న తండ్రిని కోల్పోవడం మనస్సును కలచి వేసే అంశం. కేవలం కులం కోసం వాళ్ల జీవితాలను చిన్నాభిన్నం చేశారు. వారి జీవితాల కంటే మీకు కులమే ఎక్కువా? దీని వల్ల మీరు సాధించింది ఏమిటి? అని మనోజ్ ప్రశ్నించారు.