twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ రైటర్ దర్శకత్వంలో మనోజ్

    By Staff
    |

    Manoj Kumar
    వర్షం,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలందించిన వీరు పోట్ల దర్శకత్వంలో మనోజ్ కుమార్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. నార్ని రియల్ ఎస్టేట్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమా రొమాంటిక్ స్టోరీగా వెళ్తూనే..యాక్షన్ మిళితమై ఉంటుందని తెలుస్తోంది.ఇక వీరూ పోట్ల మొదట పరుచూరి బ్రదర్స వద్ద శిష్యరికం చేసారు. అనంతరం సురేష్ ప్రొడక్షన్స్ లో ప్రేమించుకుందాం రా వంటి చిత్రాలకు పని చేసారు.

    అనంతరం ఎమ్.ఎస్.రాజు గారు వద్ద మనసంతా నువ్వే,ఒక్కడు చిత్రాలకు స్క్రిప్టు రచయితగా చేసారు. అనంతరం వర్షం,నువ్వు వొస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు కథలందించారు.అవి సూపర్ హిట్టు అవటంతో లారస్కో వారు రూపొందించబోయే చిత్రానికి డైరక్టర్ గా కమిటయ్యారు. అయితే అనుకోని విధంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో చేస్తే డైరక్షన్ చేయాలని ఆగిన వీరు తర్వాత తమిళ పోకిరి కి,ఎమ్.ఎస్ రాజు వాన చిత్రాలకు పనిచేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా డైరక్ట్ చేయటం ఆనందపరిచే విషయం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X