Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మంచు మనోజ్ .. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ
మనోజ్, శ్రియ కాంబినేషన్ లో శైలేంద్ర సినిమాస్ పతాకంపై అనీ (అనీల్ కృష్ణ) దర్శకత్వంలో డిఎస్రావు నిర్మిస్తున్న చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరో,హీరోయిన్స్ పై ముహూర్త సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అనీ మాట్లాడుతూ- మాస్ ఎంటర్టైన్మెంట్గా రూపొందే ఈ హై బడ్జెట్ మూవీ ట్రయాంగిల్ లవ్స్టోరీగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం. రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మనోజ్ను సరికొత్తగా ప్రజెంట్ చేయడమే ఈ చిత్ర ఉద్దేశమని తెలిపారు.
ఇక అనీ గతంలో అనీల్ కృష్ణ అనే పేరుతో అసాధ్యుడు, జంక్షన్ చిత్రాలు డైరక్ట్ చేసారు. ఈ రెండు చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. డి.యస్ రావు నిర్మించే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం డియస్ రావు..నాని హీరోగా పిల్ల జమీందార్ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక మనోజ్ ..త్వరలో రాజా అనే దర్శకుడుని పరిచయం చేస్తూ ఊ కొడతారా ఉలిక్కపడతారా అనే చిత్రం లో చేస్తున్నారు. దీక్షాసేధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
బ్రహ్మానందం, వేణుమాధవ్, రఘుబాబు, అల్లరి సుభాషిణి, సన, భావన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్రాజా, కెమెరా: రాజశేఖర్, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత: డిఎస్ రావు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అనీ.