Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వాళ్లంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: మంచు మనోజ్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా సెట్స్పై నిన్న (ఫిబ్రవరి 19) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో ముగ్గురు మృతిచెందగా, డైరెక్టర్ శంకర్ సహా 10 మంది తీవ్రంగా గాయాలపాలు కావడం జరిగింది. గాయాల బారిన పడ్డవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ దుర్ఘటన అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది.
కాగా, భారతీయుడు 2 షూటింగ్లో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మంచు మనోజ్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ''భారతీయుడు 2 సెట్లో ప్రమాదం జరిగిందని తెలిసి షాకయ్యాను. మృతుల (కృష్ణ, చంద్రన్, మధు) కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'' అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.
భారతీయుడు 2 సినిమాను అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్లో ఘోర ప్రమాదం జరగడంతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్ డిజైన్ చేస్తుండగా క్రేన్ తెగిపడటంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.