Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
వాళ్లంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: మంచు మనోజ్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా సెట్స్పై నిన్న (ఫిబ్రవరి 19) రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడంతో ముగ్గురు మృతిచెందగా, డైరెక్టర్ శంకర్ సహా 10 మంది తీవ్రంగా గాయాలపాలు కావడం జరిగింది. గాయాల బారిన పడ్డవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊహించని ఈ దుర్ఘటన అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్కి గురి చేసింది.
కాగా, భారతీయుడు 2 షూటింగ్లో ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మంచు మనోజ్.. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ''భారతీయుడు 2 సెట్లో ప్రమాదం జరిగిందని తెలిసి షాకయ్యాను. మృతుల (కృష్ణ, చంద్రన్, మధు) కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'' అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.
భారతీయుడు 2 సినిమాను అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా రూపొందిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్లో ఘోర ప్రమాదం జరగడంతో కోలీవుడ్తో పాటు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్ డిజైన్ చేస్తుండగా క్రేన్ తెగిపడటంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.