Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎవరిని ఉద్దేశించి మనోజ్ ఈ డైలాగు? (వీడియో)
హైదరాబాద్ : నిరుడు ‘పోటుగాడు'గా మెప్పించి, ఈ ఏడాది ఇప్పటికే ‘పాండవులు పాండవులు తుమ్మెద'లో ఆడవేషంలో తెగ అల్లరిచేసిన మంచు మనోజ్ ఇప్పుడు ‘కరెంట్ తీగ'గా వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్' ఫేమ్ రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఈ సినిమా వార్తలో నిలవడానికి ప్రధాన కారణం పోర్న్ స్టార్ నుంచి సినీ స్టార్గా మారిన సన్నీ లియోన్ తొలిసారిగా తెలుగులో నటిస్తుండటం. విష్ణుతో ‘దేనికైనా రెడీ' తీసి హిట్కొట్టిన నాగేశ్వరరెడ్డి ఇప్పుడు ఆయన తమ్ముడితోనూ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో డైలాగు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరి ని అంటే ఏ హీరోని ఉద్దేశించి ఆ డైలాగు మనోజ్ కొట్టాడు అంటున్నారు. ఆ డైలాగు ఇదే...
చెట్టు పేరో...జాతి పేరో ...చెప్పుకుని..మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయనో పండునో కాదు...కరెంట్ తీగ....
ఆ డైలాగుని మనోజ్ ఈ వీడియోలో చాలా ఎమోషనల్ గా చెప్పాడు.
సన్నీలియోన్ అందచందాలు 'కరెంట్ తీగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని కనువిందు చేయనున్నాయి. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. అది ఓ ఉపాధ్యాయురాలి పాత్రని సమాచారం. రకుల్ ప్రీత్సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్. జి.నాగేశ్వర్రెడ్డి దర్శకుడు.
ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.
సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.