Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నవంబర్ 10న విడుదలవుతున్న "ఒక్కడు మిగిలాడు"
మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ మూవీ నవంబర్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్ఫై రూపొందుతున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ అండ్రూస్ మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం మనోజ్తో ఏడాదిన్నరగా ట్రావెల్ అవుతున్నాను. హింస - అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. ఈ సినిమా కోసం మనోజ్ చాలా కష్టపడ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు తగ్గాడు. నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు" అన్నారు.
నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. "గ్రాఫిక్స్ వర్క్ వల్లే సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఆ ఆలస్యం కూడా మంచిదే.. సముద్రం దగ్గర షూట్ చేసిన సీన్స్ విశేషంగా ఆకట్టుకొంటాయి. ఇక వార్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.
మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.