Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇడియట్స్ అదంతా ఆపేయండి.. మంచు మనోజ్ ఫైర్.. అసలు విషయం ఏంటంటే?
కరోనా వైరస్ పట్ల అలుపెరగని పోరాటం చేస్తోన్న ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలని, ఉన్న నమ్మకాలని రెట్టింపు చేయాలని, భారత ప్రజల సమగ్రతను చాటిచెప్పేలా ఓ కొత్త కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రజలంతా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కదిలిన టాలీవుడ్..
ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు టాలీవుడ్ మొత్తం కదలింది. దీపాలు వెలిగించి సమగ్రతను చాటి చెప్పారు. మెగా, అల్లు, అక్కినేని ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ శ్రద్దగా ప్రధాని సూచనలను పాటించారు.
కొందరు మాత్రం హద్దులు దాటి..
అయితే ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఇంటిలోని లైట్స్ను ఆర్పివేసి దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించిన వారు కొందరైతే.. పిచ్చి పట్టి కొందరు చేసిన చేష్టలు ఇంకోలా ఉన్నాయి. దీపావళి పండుగ జరిపినట్టు సంబరాలు చేశారు. క్రాకర్స్, మతాబులు పేల్చి పిచ్చిపిచ్చిగా అరిచి నానా హంగామా చేశారు.
|
స్పందించిన మంచు మనోజ్..
ప్రధాని
ఇచ్చిన
పిలుపు
మేరకు
దీపాలను
వెలిగించిన
మంచు
మనోజ్
ఈ
కార్యక్రమంపై
స్పందిస్తూ..
ఇది
కేవలం
తొమ్మిది
నిమిషాల
కోసం
కాదు..
ఇది
మన
నిబద్దత,
సమగ్రతకు
సంబంధించిందని
తెలిపాడు.
ఈ
మేరకు
క్రాకర్స్,
బాంబులు
పేల్చిన
వారిపై
విరుచుకుపడ్డాడు.
Recommended Video
జీ బలిసిన ఎడ్యుకేటెడ్..
దీపాలు వెలిగించమని ప్రధాని చెబితే.. అత్యుత్సాహం ప్రదర్శించిన కొందరు మతాబులను కాల్చారు. వారిని ఉద్దేశిస్తూ.. క్రాకర్స్ కాల్చడం ఆపండి ఇడియట్స్.. మిమ్మల్ని అలా చేయమని ఎవ్వరూ అడగలేదు.. నాకు తెలిసి.. ఇదంతా చదువుకున్న జీ బలిసిన కొందరి పనే.. దయచేసి ఆపండి.. మనుషులుగా ఉండండని కోరాడు.