Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మంచు మనోజ్ కామెంట్!
కేసీఆర్ తెలంగాణ గాంధీ అని మంచు మనోజ్ అన్నారు. తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
Recommended Video
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ట్విట్టర్లో చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో చాలా ఆనందానికి లోనైన మంచు మనోజ్..... ఆనందం ఆపుకోలేక కేసీఆర్ మీద తన మనసులో ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టారు మంచు మనోజ్ కుమార్.
|
తెలంగాణ గాంధీ
"మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ #KCR గారికి నా అభినందనలు" అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
కేసీఆర్ నిర్ణయం సూపర్
మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల పేర్లను కూడా తెలుగులోనే రాయాలని కేసీఆర్ ఆదేశించడం సూపర్ అని అంటున్నారంతా.
మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణం అదే!
మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు' ఆలస్యానికి కారణాన్ని చిత్ర యూనిట్ వెల్లంచింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దేశం వర్థిల్లాలి... రోమాలు నిక్కబొడుస్తాయ్: ఒక్కడు మిగిలాడు ట్రైలర్
"దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు.