Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ట్వీట్ తో మంచు మనోజ్ ఓ రేంజిలో రచ్చ
హైదరాబాద్: "అందరూ వద్దనుకున్న ఓ రాజకీయనాయకుడు టాప్ లీడర్ ఎలా అవుతాడు...ఎవరో కేంద్రం నుంచి ఒక్క నాయకుడు మనతో ఇలా ఫుట్ బాల్ ఆడుతూంటే బాధగా ఉంది. మనందరం కేవలం కూర్చుని టీవి పోగ్రాంలా చూస్తున్నాం. అసలు వీళ్లు రాజకీయ నాయకులేనా..ఎవరనేది పేరు చెప్పక్కర్లేదు:) " అంటూ ఆవేశంగా మంచు మనోజ్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు ఓ రేంజిలో స్పందన వచ్చింది. ట్విట్టర్ లోనూ దీనికి చాలా మంది అనుకూలంగానూ,ప్రతికూలంగానూ స్పందించారు.
ఇక ఈ ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ చిరంజీవిని ఉద్దేశించే అని మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం విభజనాంతరం జరుగుతున్న రాజకీయపరిణామాల్లో చిరంజీవి సీఎం అయ్యే పరిస్ధితులు కనపడుతున్నాయంటూ విశ్లేషణలు వస్తున్న ఈ సమయంలో ఈ ట్వీట్ రావటం అందరినీ ఆలోచనలో పడేసింది.
పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. ఫిబ్రవరి ఆరు నుంచి చిత్రం ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.
మోహన్బాబు కెరీర్లో కలికితురాయి లాంటి సినిమా 'పెదరాయుడు'.బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్కింగ్ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్ 'సన్నాఫ్ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.