Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
రెండేళ్ళ తర్వాత హీరోగా: మోహన్ బాబు ఇంకో ప్రయోగం "గాయత్రి"
మోహన్ బాబు దాదాపు 2 ఏళ్ల తరువాత హీరోగా నటించనున్న సినిమా ‘గాయత్రి’సినిమా శ్రావణ శుక్రవారం.
హీరో మోహన్ బాబు దాదాపు 2 ఏళ్ల తరువాత తాను నటించే కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. 2015 లో మామ మంచు అల్లుడు కంచు చిత్రంలో మోహన్ బాబు నటించారు. రెండేళ్ల గ్యాప్ తరువాత ఈ సీనియర్ హీరో నటించబోయే చిత్రం నిన్న లాంచ్ అయింది. మహిళలంటే మంచు మోహన్బాబుకు ఎంతో మర్యాద. ఆయన మాటల్లో, చేతల్లో మహిళలపై గౌరవం కనిపిస్తూనే ఉంటుంది.
గాయత్రి
తాజాగా మరోసారి మహిళలపై ఆయనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. కొంత విరామం తర్వాత ఆయన హీరోగా నటించనున్న సినిమాకు ‘గాయత్రి' అనే టైటిల్ ఖరారు చేశారు. ‘పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్బాబు నిర్మించనున్న ఈ సినిమా శ్రావణ శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభమైంది.
Recommended Video
త్వరలో సెట్స్ పైకి
ఈ రోజు చిత్ర పూజా కార్యక్రమాలు రీసెంట్ గా పూర్తి కాగా, వాటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. మరి ఈ మూవీని, మదన్ తెరకెక్కించనుండగా, నటీనటులెవరు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది. థమన్ సంగీతం అందించనున్నాడు.
ముహూర్తం షాట్
గాయత్రి ముహూర్తపు సన్నివేశానికి మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా క్లాప్ ఇచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు మదన్కు అరియానా, వివియానా, మంచు లక్ష్మి, విరోనికా మంచు, నిర్మలా మంచు, పరుచూరి గోపాలకృష్ణ, ‘డైమండ్' రత్నబాబు, సుద్దాల అశోక్తేజ్లు స్క్రిప్ట్ అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు దర్శకుడు.
కన్నప్ప
ఇక ఇన్నాళ్ళు హీరోగా, విలన్ గా, నిర్మాతగా నటించిన మోహన్ బాబు మెగా ఫోన్ పట్టుకునేందుకు కూడా రెడీ అయ్యాడని తెలుస్తుంది. తనయుడు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప అనే చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్ళుగా వార్తలు రాగా, కన్నప్ప పాత్రలో విష్ణుని అద్భుతంగా చూపించేందుకు మోహన్ బాబు మెగా ఫోన్ పట్టబోతున్నాడని ప్రచారం జరగుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం. విష్ణు కన్నప్ప పాత్రలో కనిపిస్తే, మోహన్ బాబు శివుడిగా కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది.