Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. జగన్ విజయాన్ని స్వాగతించిన మోహన్బాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై సినీ నటుడు మంచు మోహన్బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజాతీర్పును ఆయన స్వాగతించారు. వైఎస్ జగన్కు జనం జై కొట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్బాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తన బిడ్డ జగన్కు ధైర్య సాహసాలతోపాటు ఆశీస్సులు అందించ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వైఎస్ జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజలు తమ ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేశారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్. అని మోహన్ బాబు అన్నారు.
ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు గక్కుతూ మంచు మోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించారు. తాజాగా వైఎస్ జగన్ విజయాన్ని ఆయన స్వాగతించారు.